ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టర్కీకి కోలుకోలేని షాకిచ్చిన ఇండియా

national |  Suryaa Desk  | Published : Sat, May 31, 2025, 07:46 PM

పహల్గాం ఉగ్రదాడి వేళ.. మనకు మిత్రులు ఎవరు.. శత్రవులు ఎవరో స్పష్టంగా తెలిసింది. పహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించి.. భారత్‌కు మద్దతుగా నిలిచాయి. కానీ అజర్‌బైజాన్, టర్కీ దేశాలు పాకిస్థాన్‌కు మద్దతిచ్చాయి. మరీ ముఖ్యంగా టర్కీ చర్యలు భారతీయులకు ఆగ్రహం తెప్పించాయి. ఒకప్పుడు సమస్యల్లో ఉన్న టర్కీని భారత్ ఆదుకుంటే.. అది విశ్వాసం మరిచిపోయి.. ఉగ్రదాడి వేళ పాకిస్థాన్‌తో కలిసి ఇండియాపై విషం చిమ్మింది. పైగా ఆపరేషన్ సిందూర్ వేళ.. పాక్‌కు అన్ని విధలా అండగా నిలిచింది.


ఈక్రమంలో టర్కీకి బుద్ధి చెప్పేందుకు భారత్ రెడీ అయ్యింది. టర్కీకి చెందిన వస్తువులను బ్యాన్ చేయడమే కాక.. ఆ దేశం నుంచి దిగుమతులు నిలిపివేసింది.తాజాగా మరో కీలక నిర్ణయంతో టర్కీకి చావు దెబ్బ రుచి ఎలా ఉంటుందో చూపించేందుకు ఇండియా రెడీ అయ్యింది. మూడు నెలల్లోనే దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది మోదీ ప్రభుత్వం. ఇంతకు ఆ నిర్ణయం ఏంటంటే..


చేసిన మేలు మరిచి.. ఇండియాకు నష్టం వాటిల్లేలా చేయాలని భావించిన టర్కీకి భారత్ ఊహించని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. దీనిలో భాగంగా ఇండిగో ఎయిర్ లైన్స్.. టర్కీ ఎయిర్‌లైన్స్‌తో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. మూడు నెలల్లో ఇరు సంస్థల మధ్య ఉన్నఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని ఇండిగోకు సూచించింది. టర్కీకి చెందిన సెలెబ్ ఏవియేషన్ అనే ఎయిర్‌ఫోర్స్ కంపెనీ.. ఇండియాలోని 9 కీలక ఎయిర్ పోర్టుల్లో సేవలు అందిస్తోంది. వీటిల్లో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది.


ఆపరేషన్ సిందూర్ వేళ.. టర్కీ చర్యలకు బదులుగా కేంద్ర ప్రభుత్వం కొన్ని వారాల క్రితం.. సెలెబ్ ఏవియేషన్ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేసింది. తాజాగా ఎయిర్ ఇండియా కూడా కేంద్రం ఇదే సూచన చేసింది. సెలెబ్ సంస్థతో ఎయిర్ ఇండియాకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అంతేకాక రానున్న 3 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఎయిర్ ఇండియాకు సూచించింది.


ఎయిర్ ఇండియా.. టర్కిష్ ఎయిర్ లైన్స్‌కు చెందిన 2 బోయింగ్ 777 విమానాలను లీజుకు తీసుకుని నడుపుతోంది. అయితే మే 31, 2025తో వీటి లైసెన్సు గడువు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా.. లైసెన్స్ గడువును మరో 6 నెలలు పొడిగించాలని కేంద్ర వైమానిక శాఖను కోరింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ అభ్యర్థనను తోసిపుచ్చింది. అంతేకాక టర్కిష్ ఎయిర్ లైన్స్‌తో ఎయిర్ ఇండియా కుదుర్చున్న ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.


ఎయిర్ ఇండియా దీనికి అంగీకరించింది. కానీ వెంటనే రద్దు చేసుకోవాలంటే.. ముందుగా బుకింగ్స్ చేసుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతాయని.. అందుకే 3 నెలలు గడువు కావాలని కోరింది. ఎయిర్ ఇండియా అభ్యర్థనకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 31 లోపు ఇరు సంస్థల మధ్య జీరో సంబంధాలు ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. మరోసారి దీన్ని పొడిగించే అవకాశమే లేదని కేంద్ర ప్రభుత్వం ఇండిగోకి స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa