'శర్మిష్ట పనోలి' ఈ పేరు ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగానే కాదు, యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న పేరు. 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని అయిన శర్మిష్ట అరెస్ట్పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. శర్మిష్ట అరెస్ట్పై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ 'ఐ స్టాండ్ విత్ శర్మిష్ట', 'ఈక్వల్ జస్టిస్' అనే హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఈ అరెస్ట్ ఇప్పుడు తెలుగు ప్రజల్లోనూ హాట్ టాపిక్ గా మారిపోయింది. విషయంలోకి వెళ్లే, శర్మిష్ట పనోలి హర్యానాలోని గుర్గావ్ కు చెందిన యువతి. పూనే లా యూనివర్శిటీలో న్యాయవాద విద్యను అభ్యసిస్తోంది. అయితే, ఈమెను బెంగాల్ పోలీసులు గుర్గావ్ వెళ్లి మరీ అరెస్ట్ చేశారు. ఎందుకంటే, ఆమె, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉగ్రవాదులకు, పాకిస్థాన్కు, మత ఛాందసవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా తన సోషల్ మీడియా అకౌంట్ ఇస్టాగ్రాం లో పోస్ట్ పెట్టింది. ఈ దారుణాలపై బాలీవుడ్ ప్రముఖులు ఎందుకు పెద్దగా స్పందించడంలేదని నిలదీసింది. ఆమెకు దాదాపు 2 లక్షల మంది ఫాలోవర్లున్నారు అయితే, తీవ్ర పదజాలంతో కూడిన ఆమె వ్యాఖ్యలు కొందరిని భాదిస్తున్నాయనే ఉద్దేశ్యంతో ఆమె తన పోస్ట్ ను డిలీట్ చేసింది. ఆమె తన తప్పును అంగీకరించి, వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పింది. అయితే, ఇప్పుడు ఆమెను సీఎం మమతాబెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. శర్మిష్ట చేసిన పోస్ట్ పై కోల్కతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రావడంతో ఆమెను కలకత్తా పోలీసులు గుర్గావ్లో అరెస్ట్ చేశారు. విద్యార్థిని అరెస్ట్ను డచ్ ఎంపీ గీర్ట్ వైల్డర్స్ తీవ్రంగా ఖండిచారు. ఏంటీ దారుణాలు అంటూ ఆయన ప్రధాని నరేంద్రమోదీని కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa