ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పతనం మొదలైందన్నారు మైలవరం నియోజవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి జోగి రమేష్. కూటమి ప్రభుత్వం ఏడాదిగా రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో వివరించడానికే వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. జూన్ 4వ తేదీన వైయస్ఆర్సీపీ చేపట్టబోయే వెన్నుపోటు దినం కార్యక్రమంలో భాగంగా ఆదివారం పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్4తో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైంది.. ప్రజల నుంచి వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఇచ్చిన హామీలన్ని అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్. ప్రజలను నమ్మబలికిన కూటమి ప్రభుత్వానికి పతనం మొదలైంది. జూన్ 04 న మైలవరం డాక్టర్ లక్కిరెడ్డి హనిమి రెడ్డి కాంప్లెక్స్ వద్ద నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు జరిగే ర్యాలీని జరుగనుంది’ అని జోగి రమేష్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa