ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది.. మంత్రి గొట్టిపాటి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 04, 2025, 01:39 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
"రాష్ట్రం విధ్వంసకారి కబంధ హస్తాల నుంచి విముక్తి పొందిన రోజు ఇదే," అని పేర్కొన్నారు. గత ఐదేళ్ల పాలన ప్రజలకు నరకయాతనగా మారిందని విమర్శించారు. “జగన్‌ మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రం ముప్పై ఏళ్ల వెనక్కి వెళ్లిపోయింది” అని ఆయన ఆరోపించారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులపై స్పష్టత వచ్చిందని, అందుకే వారు మార్పు కోసం ఓటేసినట్లు ఆయన వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa