ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది

national |  Suryaa Desk  | Published : Thu, Jun 05, 2025, 03:54 PM

బెంగళూరు నిన్న‌ జరిగిన ఘోర దుర్ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సంబరాల్లో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఈ దురదృష్టకర ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 47 మంది వ‌ర‌కు గాయపడ్డారు. ఈ సంఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు."ఆ చిన్నారుల గురించి నాకు చాలా ఆందోళనగా ఉంది. వాళ్లు 15 ఏళ్ల వయసు వాళ్లు. కనీసం 10 మంది చనిపోవడం నా కళ్లారా చూశాను. ఈ నష్టాన్ని ఏ కుటుంబం తట్టుకోలేదు" అంటూ డీకే శివకుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ముందే క‌న్నీళ్లు పెట్టుకున్నారు. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన ఈ ఘటనలో మృతి చెందిన వారిని చూసి తాను చలించిపోయానని ఆయన తెలిపారు.పరిస్థితి ఎంత వేగంగా చేయిదాటిపోయిందో వివరిస్తూ, "కార్యక్రమాన్ని పది నిమిషాల్లో ముగించేయాలని పోలీస్ కమిషనర్ నాకు చెప్పారు. అందుకే కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేశాను. అప్పటికే ఒకరిద్దరు చనిపోయారని, వెంటనే ముగించమని ఆయన నాతో అన్నారు" అని శివకుమార్ వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa