ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రంపంచంలోనే ఎత్తైన బ్రిడ్జి ప్రారంభించిన ప్రధాని మోదీ

national |  Suryaa Desk  | Published : Fri, Jun 06, 2025, 05:36 PM

132 ఏళ్ల నాటి కశ్మీర్ రాజు కల నేటితో సాకారం అయింది. ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి అయిన చీనాబ్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. రూ.43,800 కోట్లతో నిర్మించిన ఈ వంతెనపై నేడు వందేభారత్ రైలు చికుబుకు మంటూ పరుగులు పెట్టింది. ప్రధాని నరేంద్ర మోదీయే దగ్గరుండి మరీ కాత్రా నుంచి కాశ్మీర్ వరకు వెళ్తున్న వందే భారత్ రైలుకు జెండా ఊపి అందుబాటులోకి తీసుకు వచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. అంతా ఆసక్తిగా వాటిని చూస్తున్నారు.


పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రధాని మోదీ జమ్ము కశ్మీర్ వెళ్లారు. ముందుగా ఉధంపూర్‌లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో దిగిన ఈయన.. వంతెన ప్రారంభానికి ముందే దాన్ని పరిశీలించారు. అలాగే జమ్ము కశ్మీర్ మఉఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో కలిసి అనేక విషయాల గురించి చర్చించారు. ఆపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ వంతెనను ప్రారంభించారు. కాత్రా నుంచి కాశ్మీర్‌కు వళ్తున్న వందేభారత్ రైలుకు జెండా ఊపారు. అత్యంత దుర్లభమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ.. కశ్మీర్ లోయకు రైలును నడపాలన్న బ్రిటీష్ కాలం నాటి కళ నేటితో సాకారం అయింది.


ఇది మాత్రమే కాకుండా ప్రధాని మోదీ కట్‌ఢాలో రూ.46 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ఆవిష్కరించారు. అలాగే దేశంలోనే మొట్ట మొదటి సారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగానే ప్రధాని మోదీ మాట్లాడుతూ.. చీనాబ్ కేవలం ఓ రైలు మార్గం కాదని.. ఇది దేశ సమగ్రతకు ప్రతీక అని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో శాంతి, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. అలాగే పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఉగ్రవాదంపై పోరాటం, జాతీయ భద్రతపై ఆయన కఠినంగా స్పందించారు. ప్రాంతంలో శాశ్వత శాంతిని సాధించేందుకు అభివృద్ధే ఉత్తమ మార్గమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.


చీనాబ్ వంతెన ప్రత్యేకతలు..!


రైలుమార్గం ద్వారా కాశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ప్రాజెక్టుల్లో భాగమే ఈ చీనాబ్ వంతెన. అయితే నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 1315 మీటర్లు. అలాగే 1,178 అడుగుల ఎత్తుతో ఈ చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ ప్రపంచంలోనే అద్భుతమైన ఇంజినీరింగ్ ఘనతగా నిలిచింది. ఈ వంతెన ప్రారంభంతో కాశ్మీర్‌ను దేశ ప్రధాన రైల్వే వ్యవస్థతో అనుసంధానించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మార్గం సుగమమైంది. కాత్రా నుంచి కాశ్మీర్ వరకు ప్రయాణించే ఈ హైస్పీడ్ రైలు, పర్యాటకులకు, స్థానికులకు సమయాన్ని, ప్రయాణ ఖర్చును ఆదా చేస్తుంది. అంతేకాక, ఇది వ్యాపారాన్ని, ఆర్థిక కార్యకలాపాలను పురోగతిపథంలో నడిపించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa