ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఛత్తీస్‌గఢ్‌లో పోలీస్ వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు.. అడిషనల్ ఎస్పీ మృతి

Crime |  Suryaa Desk  | Published : Mon, Jun 09, 2025, 07:11 PM

ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన సుక్మా జిల్లాలో మంగళ వారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ముఖ్యంగా జూన్ 10వ తేదీన మావోయిస్టులు బంద్‌కు పిలుపును ఇవ్వగా.. పోలీసు బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఈక్రమంలోనే ఆదివారం రోజు మావోయిస్టులు చిక్వార్ గూడ వద్ద పొక్లెయిన్‌ను దహనం చేశారు. దీంతో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు కాంటా-ఎరబోరా మార్గంలో ఏఎస్పీ ఆకాశ్ రావ్.. మిగతా సిబ్బందితో కలిసి బయలు దేరారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో.. నక్సలైట్లు పాతిన ఐఈడి బాంబు పేలడంతో అడిషనల్ ఎస్పీ ఆకాష్ రావు గిరిపుంజే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే డీఎస్లీ, సీఐ సహా మరికొంత పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.


అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మరోవైపు అంబులెన్సుల ద్వారా గాయపడిన వారందినీ కొంటా ఆస్పత్రికి తరలించారు. పొలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అయితే గస్తీ కాస్తున్న బృందాన్ని లక్ష్యంగా చేసుకొని.. మావోయలు పొక్లెయిన్‌ను కావాలనే దహనం చేసిన వారిని ఉచ్చులోకి లాగినట్లు అధికారులు భావిస్తున్నారు. మరోవైపు పేలుడు జరిగిన ప్రదేశాన్ని ఇప్పటికీ సెక్యూరిటీ బలగాలు చుట్టుముట్టాయి. దాడి చేసిన నక్సలైట్లు అక్కడక్కడే ఉండొచ్చని కూడా భావించి గాలింపును కొనసాగిస్తున్నాయి.


రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఈ దాడిపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడి పక్కాగా ప్రణాళికా బద్ధంగానే జరగిందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే జవాన్లకు జరిగిన ఈ ఘోర ఘటనపై విచారణ జరుగుతోందన్నారు. నక్సల్స్ దాడులపై ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుంది అని తెలిపారు. అలాగే ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఒక ధైర్యవంతుడైన అధికారి మన మధ్య లేరు. ఆయన సేవలకు ప్రభుత్వం ఎప్పటికీ కృతజ్ఞతలు చెబుతుంది. బాధిత కుటుంబానికి అన్ని విధాలా మద్దతు అందిస్తాం,” అని ఆయన ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa