దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత నెల రోజుల నుంచిమళ్లీ కోవిడ్-19 కొత్త కేసులు పెరుగుతున్నాయి. సింగ్పూర్, హాంకాంగ్ల తర్వాత ఆసియాలో భారత్లోనే అత్యధికంగా కేసులు నమోదుకావడం గమనార్హం. ఇక, దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 6,500కి చేరువలో ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు గత 24 గంటల్లో కొత్తగా 358 మందికి వైరస్ నిర్దారణ అయినట్టు తెలిపింది.అత్యధికంగా కేరళలో కేసులు నమోదుకాగా.. ఆ తర్వాతి గుజరాత్, పశ్చిమ్ బెంగాల్, ఢిల్లీ, మహారాష్ట్రలో ఉన్నట్లు తెలిపింది. కేరళలో గడిచిన 24 గంటల్లో ఏడు కేసులు నమోదుకాగా.. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 1957కి చేరింది. గత 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదుకాలేదని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ ఏడాది కరోనాతో ఇప్పటి వరకూ 65 మంది మృతిచెందారు. మహారాష్ట్రలో అత్యధికంగా 18 మంది చనిపోయారు. తర్వాతి కేరళ (15), కర్ణాటక (9), ఢిల్లీ (7), తమిళనాడు (6), ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, గుజరాత్లలో రెండు, రాజస్థాన్, పశ్చిమ్ బెంగాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.
ఇక, దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 42 కేసులు నమోదుకాగా.. అక్కడ యాక్టివ్ కేసులు 728కి చేరాయి. కొత్తగా అరుణాచల్ ప్రదేశ్, మిజోరామ్, చంఢీగఢ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్లో కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 624 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో జనవరి 2025 నుంచి ఇప్పటి వరకూ కరోనా నుంచి 6,861 మంది కోలుకున్నారు. దేశంలో కొత్తగా రెండు వేరియంట్లబయటపడటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ వాటిని పరిశీలనలో ఉంచిన సంగతి తెలిసిందే.
మరోసారి దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆసుపత్రులలో కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ మొదలుపెట్టింది. పలు ప్రాంతాల్లో తీవ్ర శ్వాస సంబంధిత వ్యాధుల పెరుగుతున్న సందర్భంగా ఈ చర్యలు తీసుకుంటోంది. ఆక్సిజన్ సరఫరా అందుబాటులో ఉందా? లేదా? వెంటిలేటర్లు పనిచేస్తున్న స్థితి, అత్యవసర ఔషధ నిల్వలు, ఆరోగ్య సిబ్బంది ప్రతిస్పందనా సామర్థ్యం, అత్యవసర పరిస్థితులకు ఆసుపత్రుల సన్నద్ధతను ఈ డ్రిల్స్లో పరీక్షిస్తున్నారు. ‘ప్రస్తుతం నమోదవుతున్న కేసులలో చాలా వరకు స్వల్ప లక్షణాలున్నవే... హోమ్ ఐసోలేషన్లోనే కోలుకుంటున్నారు’ అని అదికారులు తెలిపారు. తేలికపాటి లక్షణాలు ఉన్నా వైద్య సలహా తీసుకోవాలని, నిబంధనలను పాటిస్తూ అపోహలు లేకుండా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఆక్సిజన్, ఔషధాల పై ఆందోళనలు అవసరం లేదని, సరఫరా తగినంతగా ఉందని అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa