ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సజ్జల రామకృష్ణారెడ్డికి మహిళా కమిషన్ సమన్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 07:18 PM

వైసీపీ సీనియర్ నేత, మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సమన్లు జారీ చేయనుంది. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనను వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని కమిషన్ ఆదేశించనుంది.  
మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ శైలజ మంగళవారం ఈ విషయాన్ని వెల్లడిస్తూ, బుధవారం సజ్జలకు సమన్లు పంపిస్తామని తెలిపారు. సాక్షి ఛానెల్‌లో జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి మహిళలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేస్తున్న మహిళలను ఉద్దేశించి సజ్జల అనుచితంగా మాట్లాడినట్లు ఆరోపణలు వచ్చాయి.  
ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని, వీటిపై సజ్జల నుంచి స్పష్టమైన వివరణ కోరుతున్నట్లు శైలజ పేర్కొన్నారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa