ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసన చేపట్టిన వైసీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 10, 2025, 07:46 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ఇవాళ సేవ్ ఉమెన్‌- సేవ్ ఆంధ్రా నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంతో జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్‌ విగ్రహాలకు వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం నేతలు వినతి పత్రాలు ఇచ్చి నిరసన తెలియజేస్తున్నారు. విజయవాడలో వైయ‌స్ఆర్‌సీపీ మహిళ విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసనలో వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు వరుదు కళ్యాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ భాగ్యలక్ష్మి,  డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు కార్యకర్తలు సైతం పాల్గొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa