ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. వారి కోసం ఓ కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. దేశంలోనే మొదటిసారిగా 80% రాయితీతో రైతులకు డ్రోన్లను అందిస్తోంది. రైతులు ఈ డ్రోన్ల ద్వారా ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేసేలా ఆలోచన చేస్తోంది. ఈ ఏడాది జిల్లాల వారీగా రైతు గ్రూపులకు డ్రోన్లను ప్రభుత్వం పరిమితంగా 875 యూనిట్లను మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వం ఐదుగురు రైతుల గ్రూపులను లబ్ధిదారులుగా గుర్తించి.. ఈ మేరకు వారికి వ్యవసాయ శాఖ ద్వారా శిక్షణ కూడా ఇచ్చారు. రైతులకు సంబంధించిన ప్రతి గ్రూపు నుంచి ఒకరికి డ్రోన్ పైలట్ శిక్షణ అందించారు.
వ్యవసాయంలో సాంకేతికతను ఉపయోగించడం వల్ల ఖర్చులు తగ్గుతాయని.. పంటలు బాగా పండుతాయని ప్రభుత్వం భావిస్తోంది.. అందుకే ఈ డ్రోన్లను తీసుకొచ్చింది. ఒక్కో డ్రోన్ యూనిట్ ధర రూ.9.80 లక్షలు కాగా.. రైతు వాటా రూ.1.96 లక్షలు.. మిగిలిన రూ.8 లక్షలు ప్రభుత్వమే చెల్లిస్తుంది. అంతేకాదు రైతులకు సంబంధించి వాటాగా ఉన్న డబ్బుల్ని బ్యాంక్ ద్వారా రుణం ఇప్పిస్తుంది ప్రభుత్వం.. ఆ డబ్బును నేరుగా డ్రోన్ కంపెనీలకు చెల్లిస్తారు. డ్రోన్ ద్వారా ఒక ఎకరంలో పురుగుమందును ఏడు నిమిషాల్లో పిచికారీ చేయొచ్చు. అదే రైతు ట్యాంక్ ద్వారా స్ప్రే చేయాలంటే కనీసం రెండు గంటల సమయం పడుతుంది అంటున్నారు. డ్రోన్ 12 లీటర్ల నీళ్లతో ఎకరా పంటకు నేరుగా మొక్క మీదకు స్ప్రే చేస్తుంది.
ఒక్క ఎకరాకు డ్రోన్తో మందు పిచికారీ చేస్తే రూ.350 వసూలు చేస్తారు.. అదే పని మనుషులతో చేయిస్తే ఇద్దరు అవసరం ఉంటుంది. రైతులకు ఇచ్చే డ్రోన్ 12 లీటర్ల ట్యాంకుతో ఉంటుంది.. రోజుకు 10 ఎకరాల్లో మందు పిచికారీ చేయొచ్చు అంటున్నారు. డ్రోన్ల సాయంతో మందులు స్ప్రే చేస్తే రైతులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఒకవేళ రైతుల కనుక మందులు స్ప్రే చేస్తే ముక్కు, నోట్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ కారణంగా శ్వాసకోశ, జీర్ణాశయ, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే పురుగుమందుల్ని స్ప్రే చేయించడానికి డ్రోన్లను తీసుకొచ్చారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం రైతులకు డ్రోన్లు కూడా అందిస్తూ వారికి ఇబ్బందు లేకుండా చేస్తోంది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa