ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి

business |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 05:01 PM

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. సోమవారం ఎంసీఎక్స్  ఆగస్ట్ ఫ్యూచర్స్ బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.1,01,078 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరింది. ఇటీవల తొలిసారిగా తులం బంగారం ధర రూ.లక్ష మార్కును దాటిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి, ముడిచమురు ధరలు పెరగడం వంటి అంశాలు పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.వెండి ధరలు కూడా దాదాపు గరిష్ట స్థాయిల్లోనే స్థిరంగా కొనసాగుతున్నాయి. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ ఈరోజు కేజీకి రూ.1,06,464 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు సానుకూలంగా ముగిశాయి. బంగారం ఆగస్ట్ ఫ్యూచర్స్ 1.91% వృద్ధితో 10 గ్రాములకు రూ.1,00,276 వద్ద స్థిరపడగా, వెండి జూలై ఫ్యూచర్స్ 0.57% లాభంతో కిలోకు రూ.1,06,493 వద్ద ముగిశాయి.గత వారం బంగారం, వెండి ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు. దీనికి తోడు డాలర్ ఇండెక్స్ బలహీనపడటం కూడా పసిడికి కలిసొచ్చింది. పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకోవడంతో డిమాండ్ పెరిగింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో క్షీణత, ముడిచమురు ధరల పెరుగుదల కూడా విలువైన లోహాల ధరలకు మద్దతునిచ్చాయి.భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా సురక్షిత పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ పెరిగింది. ఇదే బంగారం, వెండి ధరల కదలికలను ప్రభావితం చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర ఒక ఔన్సు 3,450 డాలర్లను దాటింది. రాబోయే ట్రేడింగ్ సెషన్లలో వెండి కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa