ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయి జిల్లాలోని ఓ పెట్రోల్ బంక్లో మిట్ట మధ్యాహ్నమే తీవ్ర కలకలం రేగింది. ముఖ్యంగా సిబ్బంది ఓ కారులో ఇంధనం నింపుతుండగా.. అందులో ఉన్న వారిని కిందకు దిగమని చెప్పారు. భద్రతా కారణాల వల్లే అలా చేయమని సూచించగా.. యజమాని సిబ్బందితో గొడవకు దిగాడు. కారు దిగి వచ్చి మరీ అరిచాడు. అంతలోనే కారులోంచి అతడి కుమార్తె దిగి వచ్చింది. వెంట తుపాకీ కూడా పట్టుకుని వచ్చి పెట్రోల్ బంక్ సిబ్బందిలోని ఓ వ్యక్తికి గురి పెట్టింది. పేల్చానంటే.. నీ మృతదేహాన్ని మీ వాళ్లు కూడా గుర్తించలేని స్థితోలోకి మారుతుందంటూ ధమ్కీ ఇచ్చింది. ఆమె కోపం చూసిన కుటుంబ సభ్యులు సహా స్థానికులు.. భయపడి వెంటనే ఆమెను అడ్డుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పోలీసుల సమాచారం ప్రకారం.. ఈ సంఘటన బిల్గ్రామ్ సి.ఎన్.జి స్టేషన్లో జరిగింది. ముఖ్యంగా ఇక్కడే పని చేసే రజినీష్ కుమార్ అనే వ్యక్తి వద్దకు ఓ కారు వచ్చి ఆగింది. అందులో ఉన్న యజమాని ఎహ్సాన్ ఖాన్.. తమ కారుకు ఇంధనం నింపమని చెప్పారు. అయితే ఆ సమయంలో కారులో వారి కుటుంబ సభ్యులు కూడా ఉండగా.. భద్రతా నియమాల ప్రకారం వారందరినీ కారులోంచి దిగమని చెప్పాడు సిబ్బంది రజనీష్ కుమార్. కానీ అతడు అందుకు అంగీకరించలేదు. పెట్రోల్ కొట్టడానికి తామంతా ఎందుకు దిగాలని గొడవ పడ్డాడు. ఇలా రజినీష్ కుమార్, ఎహ్సాన్ ఖాన్ మధ్య వివాదం చెలరేగింది.
ఈక్రమంలోనే రజనీష్ కుమార్.. ఎహ్సాన్ ఖాన్ను వెనక్కి నెట్టే ప్రయత్నం చేశాడు. అది చూసిన ఆయన కుమార్తె అరబా ఖాన్ అలియాస్ సురుష్ గొడవలో జోక్యం చేసుకుంది. రజనీష్ కుమార్పై చేయి చేసుకుంది. అతడు కూడా ఆమెపై అరవగా.. వెంటనే కారు వద్దకు వెళ్లి తుపాకీతో తిరిగి వచ్చింది. సిబ్బంది రజనీష్ కుమార్ కడుపులోకి గురి పెట్టి మరీ కాల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. నేను తల్చుకుంటే.. నీ మృతదేహాన్ని మీ వాళ్లు కూడా గుర్తించలేని విధంగా మార్చగలనంటూ ధమ్కీ ఇచ్చింది. అయితే ఈ విషయం గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు సహా స్థానికులు వెంటనే వచ్చి అడ్డుకున్నారు. కానీ ఏమాత్రం భయపడని రజనీష్ కుమార్ మాత్రం ఆమెతో వాదిస్తూనే ఉన్నాడు.
ఈసమయంలోనే అరిబా తల్లి హుస్నాబానో ఆమెను అక్కడి నుంచి లాక్కెళ్లిపోయింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు అంతా కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదంతా జరిగిన తర్వాత రజనీష్ కుమార్.. నేరుగా బిల్గ్రామ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనితో పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 115(2), 352, మరియు 351(3) కింద కేసు నమోదు చేశారు. అలాగే ఆయుధాల చట్టంలోని సెక్షన్ 30 కింద కూడా కేసు పెట్టారు. ఈక్రమంలోనే పెట్రోల్ బంక్లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. ముగ్గురు నిందితులకు నోటీసులు జారీ చేశారు. అందులో యజమాని ఎహ్సాన్ ఖాన్, అతని భార్య హుస్నాబానో, కుమార్తె అరిబాలు ఉన్నారు.
ముఖ్యంగా వీరి దగ్గరి నుంచి లైసెన్స్డ్ రివాల్సవర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ సాగుతోంది. ఎహ్సాన్ ఖాన్ ఆ రివాల్వర్ను చట్టబద్ధంగా కలిగి ఉన్నాడని ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అంతా షాక్ అవుతున్నారు. ఒక అమ్మాయి ఇలా ప్రవర్తించగలదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa