ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వంతెన ప్రమాదకరమని ముందే చెప్పాం, బోర్డులు కూడా పెట్టాం....: దేవేంద్ర ఫడ్నవీస్

national |  Suryaa Desk  | Published : Mon, Jun 16, 2025, 07:35 PM

మహారాష్ట్రలోని పుణె జిల్లాలోని ఇంద్రాయణి నదిపై వంతెన కూలిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు చనిపోయినట్లు ప్రకటించి అధికారులు.. గల్లంతు అయిన వారి జాడ గుర్తించేందుకు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే వస్తోంది. అయితే తాజాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఈ వంతెన ప్రమాదకరం అని ఘటన జరగకముందే తాము హెచ్చరించామని అన్నారు. అలాగే బ్రిడ్జి వద్ద ప్రమాదకరం అని రాసి ఉన్న బోర్డులు కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. కానీ ప్రమాద తీవ్రత తెలియని పర్యాటకులు దానిపైకి వెళ్లగా.. బ్రిడ్జి కూలిపోయి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.


పుణె జిల్లాలోని ఇంద్రాయణి నదిపై కుందమాలా పర్యాటక ప్రాంతానికి ఆదివారం పర్యటకులు అధిక సంఖ్యలో వచ్చారు. అక్కడున్న ఇనుప వంతెనపై అనేక మంది వచ్చి నిలబడిన క్రమంలోనే కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. ఈ ఘటనలో అనేక మంది పర్యాటకులు గల్లంతు అయ్యారు. ఇందులో నలుగురు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొందరి కోసం ఇప్పటికీ అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ విషయాలను నేరుగా అధికారులే వెల్లడించారు. అయితే తాజాగా ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు.


 ప్రమాద ఘటన జరగకముందే ఇంద్రాయణి నదిపై ఉన్న ఈ వంతెన ప్రమాదకరం అని స్థానిక కలెక్టర్ ఇప్పటికే ప్రకటించినట్లు గుర్తు చేశారు అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేశారని వివరించారు. కానీ దాని తీవ్రత గురించి తెలియక ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వంతెన పైకి వెళ్లారని అన్నారు. ఈక్రమంలోనే తుప్పు పట్టిన వంతెన బరువు ఆపలేకపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని చెప్పారు. అయితే కొత్త బ్రిడ్జిని నిర్మించేందుకు రాష్ట్ర సర్కారు ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేసిందని సీఎం వెల్లడించారు. ఆ దిశగానే చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.


ఈ ప్రమాదం తర్వాత పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాలని సంబంధింత అధికారులకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశారు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ వంతెన పుణె జిల్లాలో దైనందిన రాకపోకలకు అత్యంత కీలకం. అయితే కాలక్రమేణా ఇది శిథిలావస్థకు చేరుకుంది. దీని వల్ల వాహనదారులు, పాదచారులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని గుర్తించిన జిల్లా కలెక్టర్, వంతెన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ దానిని 'ప్రమాదకరమైనది'గా ప్రకటించారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే కలెక్టర్ హెచ్చరికల తర్వాత కూడా సంబంధిత విభాగాల నుంచి వంతెన మరమ్మత్తుల విషయంలో చెప్పుకోదగ్గ పురోగతి లేదని సమచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa