ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని 1,355 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లక్ష మందికిపైగా విద్యార్థులకు ఉచితంగా JEE, NEET కోచింగ్తో పాటు స్టడీ మెటీరియల్ అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలైన IITలు, వైద్య కళాశాలల్లో చేరే అవకాశం పొందనున్నారు.
దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంత పెద్ద ఎత్తున JEE, NEET స్థాయి అకడమిక్ సపోర్ట్ అందించడం విశేషమని మంత్రి లోకేశ్ తెలిపారు. ఎంపీసీ, బైపీసీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రోజువారీ అదనపు తరగతులు, పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించబడింది.
ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు కూడా ఉన్నత విద్యా లక్ష్యాలను సాధించే అవకాశం కల్పించడం జరుగుతుందని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. ఈ చర్య రాష్ట్ర విద్యా వ్యవస్థలో సంస్కరణలకు ఒక మైలురాయిగా నిలుస్తుందని, యువతకు పోటీ పరీక్షల్లో రాణించేందుకు అవసరమైన మద్దతు అందిస్తుందని ఆయన అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa