ఏపీ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఓ కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. పూర్తి వివరాల్లోకి వస్తే.. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామంలో టీడీపీ నేత గతంలో హత్యకు గురయ్యారు. రొంపిచర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ అయిన వెన్నా బాలకోటిరెడ్డి 40 ఏళ్లుగా టీడీపీ కోసం పనిచేశారు. స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సుమారు ఏడాదిన్నర కింద బాలకోటిరెడ్డి హత్యకు గురయ్యారు. ఇంట్లో నిద్రపోతున్న బాలకోటిరెడ్డిని తుపాకీతో కాల్చిచంపారు. హత్యకు ఆరు నెలల ముందు కూడా అతనిపై దాడి జరిగింది.
అయితే ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాలకోటిరెడ్డి కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించారు. ఉండవల్లిలోని తన నివాసానికి బాలకోటిరెడ్డి కుటుంబాన్ని పిలిపించుకున్న నారా లోకేష్.. వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్థికంగా కష్టాలలో ఉన్నట్లు వెన్నా బాలకోటిరెడ్డి కుటుంబం నారా లోకేష్ ముందు వాపోయింది. ఇల్లు కూడా తాకట్టులో ఉందని లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో పార్టీకోసం కష్టపడిన బాలకోటిరెడ్డి కుటుంబానికి పెద్దకొడుకులా జీవితాంతం అండగా ఉంటానని నారా లోకేష్ అప్పట్లో భరోసా ఇచ్చారు. ఇక ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ.. వెన్నా బాలకోటిరెడ్డి ఇంటిపై తీసుకున్న రుణాన్ని నారా లోకేష్ తీర్చారు. వెన్నా బాలకోటిరెడ్డి సతీమణి వెన్నా నాగేంద్రమ్మకు ప్రతి నెలా ఆర్థిక సాయం అందిస్తూ పెద్దకొడుకులా భరోసా ఇస్తున్నారు..
మరోవైపు ఢిల్లీ పర్యటనలో మంత్రి నారా లోకేష్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్షాతో నారా లోకేష్ భేటీ అయ్యారు. సుమారు 25 నిమిషాల పాటు అమిత్ షా - నారా లోకేష్ భేటీ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఢిల్లీ పర్యటనలో మరికొందరు కేంద్రమంత్రులతో నారా లోకేష్ సమావేశం కానున్నారు. కేంద్ర మంత్రులు చిరాగ్ పాసవాన్, అర్జున్రామ్ మేఘ్వాల్తో నారా లోకేష్ భేటీ కానున్నారు. అలాగే బుధవారం ఉదయం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్తో నారా లోకేష్ భేటీ అయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa