ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఈ నెల 12వ తేదీతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అమరావతి రాజధానిలో నేడు బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఈ బహిరంగ సభను 12వ తేదీన నిర్వహించాలని తొలుత భావించినప్పటికీ, గుజరాత్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం కారణంగా నేటికి వాయిదా వేశారు.సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర సచివాలయం వెనుక భాగంలో వేదికను ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధిని తెలియజేయడంతో పాటు రాబోయే నాలుగేళ్లలో అమలు చేయనున్న పథకాలు, అభివృద్ధి గురించి వివరించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa