2027లో జరిగే గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. 12 మంది మంత్రులు ఈ ఉపసంఘంలో సభ్యులుగా నియమితులయ్యారు. వీరిలో ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ తదితరులు ఉన్నారు. పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళికను ఈ ఉపసంఘం రూపొందించనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa