ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 25, 2025, 07:53 PM

రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో గొప్ప బాధ్యతను అప్పగించారని, వారి నమ్మకాన్ని నిలబెడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మచిలీపట్నం అంటే తెలుగుదేశం పార్టీ అని, ఇక్కడ గెలిచినప్పుడే రాష్ట్రవ్యాప్తంగా విజయం ఖాయమైందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రి కొల్లు రవీంద్రపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఆయన పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు కోసం ధైర్యంగా నిలబడ్డారని లోకేశ్ ప్రశంసించారు. అదేవిధంగా, మచిలీపట్నంలో అనేక వేధింపులు ఎదుర్కొన్నప్పటికీ, పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపునూ అందుకుని, కార్యక్రమాలను విజయవంతం చేసిన కార్యకర్తలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన తాను, ముందుగా కార్యకర్తలతో సమావేశం కావడానికే ప్రాధాన్యత ఇచ్చానని, ఇకపై నాయకులందరూ నియోజకవర్గ పర్యటనల్లో తొలుత కార్యకర్తలతో సమావేశం కావాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa