కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా పర్యటనలో పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని, దీనిని ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంపై ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం భారత్ హక్కు అని రాజ్నాథ్ స్పష్టం చేశారు. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవని ఆయన ఉద్ఘాటించారు.
షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సమావేశంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఉగ్రవాదాన్ని ఎస్సీఓ సభ్య దేశాలు ఏకగ్రీవంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద కార్యకలాపాలు ప్రపంచ శాంతికి ముప్పు వాటిల్లుస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల చేతుల్లో విధ్వంసకర ఆయుధాలు ఉండకూడదని, ఇందుకోసం అంతర్జాతీయ సమాజం ఐక్యంగా పనిచేయాలని ఆయన కోరారు.
భారత్ ఎల్లప్పుడూ శాంతిని కోరుకునే దేశమని, అయితే తమ భద్రతకు ఎదురయ్యే ఏ రకమైన ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్ వంటి చర్యలు దేశ భద్రతను కాపాడేందుకు అవసరమైతే వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa