ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ధర్మవరం జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, పేర్ని నాని ప్రజాస్వామ్య విలువలను గౌరవించకుండా డిప్యూటీ సీఎం పట్ల అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతికి విరుద్ధమని, వాటిని జనసేన తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు.
చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో మాటలకు హద్దు ఉండాలని, రాజకీయ విమర్శలు వ్యక్తిగత స్థాయికి దిగజారకూడదని సూచించారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కృషిని కాదని, వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని హెచ్చరించారు. పేర్ని నాని వంటి నాయకులు తమ రాజకీయ అస్తిత్వం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్కు పాల్పడుతున్నారని, అయితే ప్రజలు వీటిని తిరస్కరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
జనసేన నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్కు మద్దతుగా గట్టిగా నిలబడతామని చిలకం మధుసూదన్ రెడ్డి పునరుద్ఘాటించారు. పేర్ని నాని వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. రాష్ట్రంలో శాంతి, సమైక్యతను కాపాడేందుకు జనసేన కట్టుబడి ఉందని, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa