ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రీకాలింగ్ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో పేరుతో ప్రభుత్వ మోసాన్ని ప్రజలకి చెపుతాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 28, 2025, 10:37 AM

ఎన్నిక‌ల‌ హామీలను త్రికరణ శుద్ధితో అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓట్లు వేయించుకొని మోసం చేశార‌ని, ఈ మోసాల‌ను ఇంటింటికీ తీసుకెళ్దామ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా అధ్య‌క్షుడు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్ర‌వారం తిరుప‌తిలో రీకాలింగ్ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో కార్యక్రమాన్ని పార్టీ రీజ‌న‌ల్ కో-ఆర్డినేట‌ర్ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి,  ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, పార్టీ సమన్వయకర్తలు అభినయ్ రెడ్డి, విజయానంద రెడ్డి, సునీల్, బియ్యపు మధుసూదన్ రెడ్డి, కృపాలక్ష్మి ప్రారంభించారు. అనంత‌రం 'చంద్ర‌బాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ' క్యూఆర్ కోడ్‌తో కూడిన పోస్ట‌ర్ ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా భూమ‌న మాట్లాడుతూ..`చంద్ర‌బాబు సూప‌ర్ సిక్స్ హామీల విష‌యంలో మాట తప్పారు. అందుకే రీకాలింగ్ చంద్రబాబు మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ రూపొందించారు. ఇంటింటికీ వచ్చే మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలను నిలదీయాలి. కూటమి ఏడాది పాలనలో సూపర్ సిక్స్ హామీలు,  143 హామీలలో ఏది నెరవేర్చలేదు. బాండ్లపై పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు  సంతాకాలు చేసి మరి ఇచ్చారు. కానీ అధికారంలోకి రాగానే మాట తప్పి ప్రజలని మోసం చేస్తున్నారని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa