ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్.,,,కందిపప్పు సరఫరా లేనట్లే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 28, 2025, 08:48 PM

ఏపీలోని రేషన్ కార్డుదారులకు బ్యాడ్ న్యూస్. వచ్చే నెలలోనూ రేషన్ కార్డుదారులకు కందిపప్పు అందేలా కనిపించడం లేదు.2025 మార్చి నెల నుంచి ఏపీలో రేషన్ కార్డుదారులకు కందిపప్పు పంపిణీ ఆగిపోయింది. జులై నెలలోనూ కందిపప్పు అందేలా కనిపించడం లేదు. మార్కె్ట్లో కిలో కందిపప్పు ధర రూ.120 నుంచి రూ.160 వరకూ పలుకుతోంది. నాణ్యతను అనుసరించి కందిపప్పు రేటు ఉంది. కందిపప్పు రేటు మండిపోతూ ఉండటంతో సామాన్యుడికి కొనడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా అందించే కందిపప్పు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే మార్చి నెల నుంచి ఏపీలో రేషన్ కార్డుదారులకు కందిపప్పు పంపిణీ చేయడం నిలిచిపోయింది.


జులై నెల నుంచి రేషన్ కార్డుదారులకు బియ్యం, చక్కెరతో పాటుగా రాగులు, కందిపప్పు కూడా అందిస్తామని ప్రభుత్వం అప్పట్లో చెప్పింది. అయితే అమలుకు మాత్రం నోచుకోలేదు. జులై నెలకు సంబంధించి నిత్యావసరాలు ఇప్పటికే చేరుకోగా.. ఈసారి కూడా కందిపప్పు సరఫరా లేదని అధికారులు చెప్తున్నారు. రేషన్ దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.67లకే పంపిణీ చేస్తారు. అదే మార్కెట్లో అయితే కనీసం రూ.120 చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా కందిపప్పు సరఫరా లేదని తెలిసి సామాన్య ప్రజానీకం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా కందిపప్పు అందించాలని కోరుతున్నారు.


ఒలింపిక్స్‌లో యోగా.. మోదీ తలచుకుంటే ఏదైనా సాధ్యమే: చంద్రబాబు


ఐదు రోజుల ముందే రేషన్ సరుకులు


మరోవైపు ఏపీలో వృద్ధులు, దివ్యాంగులకు జులై నెలకు సంబంధించి రేషన్ పంపిణీ అప్పుడే మొదలైపోయింది. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఆదివారాలు సహా రేషన్ షాపులు రెండు పూటలా అందుబాటులో ఉంచాలని రేషన్ డీలర్లను ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే.


అయితే దివ్యాంగులు, వృద్ధులకు మాత్రం ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేస్తామని తెలిపింది. అందులో భాగంగా ఒకటో తేదీకి ఐదు రోజుల ముందే వృద్ధులు, దివ్యాంగులకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటివద్దే రేషన్ సరఫరా చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెలా 26 నుంచే రేషన్ సరుకులను ఇంటి వద్ద పంపిణీ చేయనున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa