విద్యుత్ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) గుడ్ న్యూస్ వినిపించింది. అడ్వాన్స్ కంజప్షన్ డిపాజిట్ (ఏసీడీ) ఛార్జీలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీసీపీడీసీఎల్ సీఎండీ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. పీఎం సూర్యఘర్ పథకం కింద చాలామంది ఇంటిపైన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే పీఎం సూర్యఘర్ పథకం లబ్ధిదారులు, అలాగే తక్కువ కరెంట్ వాడే గృహ వినియోగదారుల నుంచి ఏసీడీ ఛార్జీలను విద్యుత్ సిబ్బంది వసూలు చేస్తు్న్నారు. దీంతో విద్యుత్ వినియోగదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. కరెంట్ బిల్లు తగ్గుతుందని సోలార్ ప్యానెళ్లు పెట్టుకుంటే.. ఈ ఎక్స్ట్రా ఛార్జీలు ఏమిటంటూ జనం మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీసీపీడీసీఎల్ ఈ నిర్ణయం తీసుకుంది.
500 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించేవారిని తక్కువ కరెంట్ ఉపయోగించే వినియోగదారులుగా.. 500 కంటే ఎక్కువ యూనిట్లు ఉపయోగిస్తే ఎక్కువ విద్యుత్ ఉపయోగించే వారిగా విద్యుత్ సిబ్బంది పరిగణిస్తారు. అయితే ఎక్కువ కరెంట్ వాడే వారితో పాటుగా.. తక్కువగా కరెంట్ ఉపయోగించేవారు, పీఎం సూర్యఘర్ పథకం కింద సోలార్ ప్యానెళ్లు పెట్టుకున్నవారితోనూ ఏసీడీ ఛార్జీలు వసూలు చేశారు. దీనిపై ప్రజల నుంచి వ్యతిరేకత రావటంతో 500 యూనిట్ల కంటే తక్కువ కరెంట్ ఉపయోగించేవారు, సూర్యఘర్ పథకం లబ్ధిదారులకు ఏపీసీపీడీసీఎల్ ఏసీడీ ఛార్జీలను రద్దు చేసింది.
విద్యుత్ వినియోగదారుల వార్షిక వినియోగంలో 2 నెలల బిల్లు మొత్తాన్ని అధికారులు లెక్కిస్తారు. ఆ మొత్తాన్ని సదరు విద్యుత్ సంస్థ వినియోగదారుడి నుంచి వసూలు చేసి తమ వద్ద డిపాజిట్గా పెట్టుకుంటుంది. దానినే ఏసీడీ అంటారు. ఈ డిపాజిట్పై వచ్చే వడ్డీని.. వినియోగదారుల ఏప్రిల్ కరెంట్ బిల్లులో తగ్గిస్తారు. అయితే 500 యూనిట్లలోపు కరెంట్ వాడే కుటుంబాలతో పాటుగా. పీఎం సూర్యఘర్ పథకం కింద ఇంటి మీద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలతోనూ ఈ ఏసీడీ ఛార్జీలు వసూలు చేయటంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో అదికారులు ఈ ఛార్జీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa