ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్టీసీకి ఇచ్చే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను పునరుద్ధరించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 30, 2025, 01:18 PM

పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఆర్టీసీకి ఇచ్చే శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను టీటీడీ పునరుద్ధరించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కోరారు. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కోరినట్లు చెప్పారు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టూరిజం కోటా కింద కల్పించే ఈ సౌకర్యం ఇతర రాష్ట్రాల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, గత డిసెంబరు నుంచి టీటీడీ ఈ కోటాను రద్దు చేసిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa