బీపీ, షుగర్.. ఈ రెండు వ్యాధులు ప్రస్తుతం ప్రపంచానికి సవాల్గా మారాయి. ఒక ఏజ్ వచ్చిన తర్వాతే షుగర్ వస్తుందనే రోజులు పోయాయ్. ఇప్పుడు చిన్నాపెద్దా తేడా లేకుండా షుగర్ అందరినీ పలకరిస్తోంది.10 నెలల పసి పిల్లల నుంచి 80 ఏళ్ల పండు ముసలి వారి వరకు ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధులు ఒక్కసారి వచ్చాయంటే పూర్తిగా నయం కావు. ఇక జీవితాంతం వాటిని కంట్రోల్లో ఉంచుకోవాల్సిందే. మనుపటిలా ఇష్టం ఉన్న ఆహారం తీసుకోలేం. ప్రాణాలతో ఉండాలంటే ఇష్టాలను చంపుకుని నోటికి తాళం వేయాలి.90 డేస్ నో షుగర్ ఛాలెంజ్లో షుగర్ వ్యాధికి కారకాలైన ఆహార పదార్థాలను అవైడ్ చేయాలి. అధిక చక్కర స్థాయిలు ఉన్న పదార్థాలను తీసుకోకూడదు. అయితే, ఇన్ని రోజులు ఆ ఫుడ్కు అలవాటు పడి ఒక్కసారిగా మానేయడం కష్టమే. ఇలా చేయడం వల్ల మొదట్లో తీవ్రమైన కోరికలు, తలనొప్పి, అలసట, చిరాకు ఉంటాయి. శరీరం మొదట్లో ప్రతిఘటించినప్పటికీ.. కొన్ని రోజుల తర్వాత అలవాటు అవుతోంది.
కాలక్రమేణా లక్షణాలు తగ్గుతాయి. అలవాట్లు మారడం ప్రారంభమవుతాయి. వారాలు గడిచేకొద్దీ గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. చాలామందిలో మెరుగైన నిద్ర, జీర్ణక్రియ, మానసిక స్థితి ఏర్పడుతోంది. ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడటంతో పాటు జీవక్రియ రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మంట తగ్గడంతో చర్మం క్లియర్ కావడం ప్రారంభమవుతుంది.90 రోజులు పూర్తయ్యే సమయానికి శారీరకంగా, మానసికంగా పరివర్తన చెందుతారు. శరీరం మునపటి కంటే మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. అయితే ఈ ఛాలెంజ్కు దృఢ సంకల్పం అవసరం. సీరియస్గా ఫాలో అవుతే మాత్రం దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు నొక్కి చెబుతున్నారు. శరీరంలో శాశ్వత మార్పులు చేసుకోవాలనుకునే వారికి 90 రోజుల నో షుగర్ చాలెంజ్ ఒక మలుపు కావచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa