ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా వ్యతిరేకతతో కూటమి ఓటమి అంచుల్లోకి చేరింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 01, 2025, 12:27 PM

కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సుపరిపాలన కాదు, దుర్మార్గమైన పాలనకు పడిన తొలి అడుగు అని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజా వ్యతిరేకత పెరిగితే, కూటమి సైతం రానున్న రోజుల్లో ఓటమి పాలు కాక తప్పదని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన 'బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ' కాస్తా నేడు చంద్రబాబు చేసిన దగాతో 'వెన్నుపోటు గ్యారెంటీ' అని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఇంటింటికీ వెళ్ళే కూటమి నాయకులకు త్వరలోనే ఇది అర్థమవుతుందని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa