యోగా గురువు బాబా రాందేవ్ తాజా వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సాధారణంగా మనిషి ఆయుర్దాయం 100 సంవత్సరాల వరకు ఉంటుందని భావిస్తారు. అయితే సహజంగా మనిషికి 150 నుంచి 200 సంవత్సరాల వరకూ జీవించే సామర్థ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది యోగం, ఆయుర్వేద జీవనశైలికి కట్టుబడి ఉండటం వల్ల సాధ్యమవుతుందని అన్నారు.
ప్రస్తుత కాలంలో మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయిందని బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. మెదడు, గుండె, కళ్లు, కాలేయం వంటి కీలక అవయవాలపై అధిక ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. టెక్నాలజీ ఆధారిత జీవన విధానంలో మనసుకు విశ్రాంతి లేకపోవడం, శారీరక చలనం తగ్గిపోవడం వంటివి ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు.
ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే, బాబా రాందేవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి తన జీవితంలో 100 ఏళ్లలో తినాల్సిన ఆహారాన్ని కేవలం 25 ఏళ్లకే తీసుకుంటూ ఆరోగ్యాన్ని హానిచేస్తున్నాడని అన్నారు. సంతృప్తికి మించిన ఆహారం తీసుకోవడం, ప్రకృతికి విరుద్ధంగా జీవించడం ఆయుర్దాయాన్ని తగ్గిస్తున్నదని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa