ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ జగన్‌కు రిలీఫ్.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 01, 2025, 08:47 PM

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. పల్నాడు జిల్లా పర్యటనలో జరిగిన సింగయ్య మృతి కేసులో.. వైఎస్ జగన్ నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును కొట్టివేయాలంటూ వైఎస్ జగన్.. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు .. కేసు విచారణపై తదుపరి చర్యలు నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. అనంతరం వైఎస్ జగన్ పిటిషన్ మీద విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇటీవల పల్నాడు జిల్లాలో పర్యటించారు. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వృద్ధుడు చనిపోయాడు. అయితే వైఎస్ జగన్ కారు కింద పడే సింగయ్య చనిపోయాడంటూ వీడియో వెలుగుచూసింది. ఈ వీడియో సహా ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా పోలీసులు వైఎస్ జగన్ మీద కేసు నమోదు చేశారు.


ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్లలో పర్యటించారు. వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా.. కారు కింద పడి సింగయ్య అనే వృద్ధుడు చనిపోయాడు. అయితే వైఎస్ జగన్ కారు కిందపడే సింగయ్య చనిపోయినట్లు వీడియో బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఏ2గా చేర్చారు.


అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం రాజకీయ ఉద్దేశంతో తనపై కేసు పెట్టిందని వైఎస్ జగన్ పిటిషన్‌లో ఆరోపించారు. వైఎస్ జగన్‌తో పాటుగా వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు విడదల రజిని, పేర్ని నానిలు కూడా హైకోర్టును ఆశ్రయించారు. సింగయ్య మృతి కేసులో పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని జగన్‌తో పాటూ మిగిలిన వైసీపీ నేతలు హైకోర్టును కోరారు,


వైఎస్ జగన్, ఇతర వైసీపీ నేతల పిటిషన్‌ను ఇటీవల విచారించిన ఏపీ హైకోర్టు.. జులై ఒకటో తేదీ వరకూ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ ఇటీవల పోలీసులను ఆదేశించింది. జులై ఒకటిన (మంగళవారం మరోసారి ఈ పిటిషన్ల మీద మీద విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. కేసు విచారణపై స్టే విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కేసు విచారణను మరో రెండు వారాలకు వాయిదా వేసింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa