ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ 62 లక్షల వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్,,,,సంచలన నిర్ణయం తీసుకున్న ఢిల్లీ సర్కార్

national |  Suryaa Desk  | Published : Tue, Jul 01, 2025, 09:27 PM

వాహనదారులకు ఇది భారీ షాకింగ్ వార్తే అని చెప్పవచ్చు. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా లక్షల వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోయవద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ సంచలన నిర్ణయం తీసుకుంది ఎక్కడ.. ఎందుకు ఇంత భారీ ఎత్తున వాహనాలకు ఇంధనం బ్యాన్ చేశారనే వివరాలు తెలియాలంటే ఇది చదవండి. ఇక ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది ఎక్కడంటే దేశ రాజధాని ఢిల్లీలో.


ఢిల్లీ సర్కారు కాలం చెల్లిన, పాత బండ్ల యజమానులకు గట్టి షాక్ ఇచ్చింది. ఇక వీటికి ఇంధనం పోయవద్దని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా నిర్ణయం తీసుకోగా.. నేటి నుంచి అనగా జులై 1, మంగళవారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని ఢిల్లీ సర్కార్ స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో పర్యావరణాన్ని కాపాడటం, కాలుష్యాన్ని నివారించడం కోసం రేఖా గుప్తా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ఢిల్లీలోని వాహనాలకే కాక.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు కూడా వర్తిస్తుందని ఢిల్లీ సర్కార్ వెల్లడించింది. వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు పాతవని తేలితే వాటికి ఇంధనం పోయవద్దని ఢిల్లీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.


10 సంవత్సరాలు దాటిన డీజిల్ వాహనాలు, పెట్రోల్ వాహనాల విషయానికి వస్తే.. 15 సంవత్సరాలు నిండిన వాటికి ఇకపై బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోయవద్దని ఢిల్లీ కమిషన్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. జులై 1, మంగళవారం నుంచి ఈ రూల్స్ అమల్లోకి వస్తాయని కమిషనర్ వెల్లడించారు. దీనిపై వాహనదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో జీవిత కాలం ముగిసిన వాహనాలను గుర్తించేందుకు ఆధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్(ఏఎన్ఆర్) కెమెరాలను వినియోగిస్తున్నారు.


ఇక ఇప్పటికే ఢిల్లీ వ్యాప్తంగా సుమారు 500 స్టేషన్స్‌లో ఏఎన్‌ఆర్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాహనాల కాలం ముగిసిందా లేదా తెలుసుకోవడం కోసం.. ముందుగా ఆ వాహనాల నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేయడంతో పాటు దాని రికార్డులను చెక్ చేస్తారు. వాటి జీవిత కాలం ఇంకా ముగియలేదు.. ఇతర అన్ని రిపోర్టులు సరిగ్గా ఉన్నాయని తెలిస్తే.. అప్పుడు ఆ వెహికల్స్‌లో పెట్రోల్, డీజిల్ పోస్తారు. ఇకపోతే, ఢిల్లీలో సుమారు 62 లక్షల వరకు పాత వాహనాలు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయంతో వీటి యజమాలకు తిప్పలు తప్పవని అర్థం అవుతుంది.


దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కోరలు చాస్తుంది. ఇక శీతాకాలంలో అయితే ఢిల్లీలో ఊపిరి పీల్చుకోవడం కూడా చాలా కష్టంగా మారుతుంది. కంపెనీలు వర్క్ ఫ్రం హో ఇస్తాయి. పాఠశాలలకు సెలవులు కూడా ప్రకటిస్తారు. కాలుష్య కట్టడి కోసం పాత వాహనాలను నియంత్రించాలని భావించిన ప్రభుత్వం.. నో ఫ్యూయల్ నిబంధనను తీసుకువచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa