ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి వివాహితపై ఆర్‌ఎంపీ అఘాయిత్యం

Crime |  Suryaa Desk  | Published : Tue, Jul 01, 2025, 10:50 PM

తెలిసిన వ్యక్తి లిఫ్ట్ ఇస్తానంటే ఆ మహిళ కాదనలేకపోయింది. అమాయకంగా నమ్మి అతడి కారు ఎక్కింది. అప్పటికే నీచమైన ఆలోచనలతో ఉన్న ఆ దుర్మార్గుడు తనలోని మృగాన్ని నిద్రలేపాడు. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా గడ్డిమందు ఇంజెక్ట్ చేసి ఆమె ప్రాణాలు బలి తీసుకున్నాడు. పోలీసులు సినీఫక్కీలో ఛేజ్ చేసిన ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ దారుణ ఘటన నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండల పరిధిలో చోటు చేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. గుర్రంపోడ్ మండల జూనూతుల గ్రామంలో మహేష్ అనే ఆర్ఎంపీ డాక్టర్ గత ఆరేళ్లుగా ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వివాహిత (35) భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి మిర్యాలగూడలో నివాసం ఉంటుంది. వివాహిత అత్త వృద్ధాప్యంతో బాధపడుతూ స్వగ్రామంలోనే ఉంటుంది. ఆమెను చూసేందుకు గాను ఆదివారం (జూన్ 29) సాయంత్రం మిర్యాలగూడ నుంచి జూనుతల బయల్దేరింది. ఆ గ్రామానికి డైరెక్ట్ బస్ లేకపోవటంతో కొండ మల్లేపల్లిలో బస్సు దిగి.. జూనుతల బస్ కోసం ఎదురు చూస్తంది. అంతలోనే మహేష్ అక్కడకు కారులో వచ్చాడు. 'నేను కూడా జూనూతుల వెళ్తున్నాను వస్తారా..?' అంటూ ఆమెతో మాట కలపాడు. గ్రామానికే చెందిన ఆర్ఎంపీ డాక్టర్ కావటంతో అతడి మాటలు నమ్మి కారు ఎక్కింది.


కొద్దిదూరం వెళ్లగానే రోడ్డు పక్కన కారు ఆపి కూల్‌డ్రింక్ తీసుకున్నాడు. ఆమెకు తెలియకుండానే అందులో మత్తు మందు కలిపి ఇ్చచాడు. అది తాగిన కాసేపటికే వివాహిత మత్తులో జారుకుంది. ఇదే అదునుగా ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి మత్తులో ఉండగానే ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి నేరుగా నల్గొండ తీసుకెళ్లాడు. ఆమె అపస్మారక స్థితిలో ఉండగానే.. అక్కడ గడ్డమందు కొనుగోలు చేశాడు. అనంతరం రెండు చేతులకు గడ్డి మందు ఇంజెక్ట్ చేసాడు. అర్ధరాత్రి 12 తర్వాత కారులో జూనుతల బయల్దేరాడు.


గుర్రంపోడ్ మండల కేంద్రంలో అప్పటికే పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి వేళ దేవరకొండ వైపు వెళ్తున్న ఒక కారు వేగంగా వెళ్లటాన్ని గమనించారు. గొర్రెల దొంగలు అయి ఉండొచ్చుననే అనుమానంతో కారును ఛేజ్ చేసే ప్రయత్నం చశారు. జూనూతుల స్టేజీ దాటి.. కాచారం స్టేజీ వైపు మలుపు తిరిగిన తర్వాత కారు డ్రైవర్ లైట్లు ఆర్పినట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వైపు వెళ్లగా.. ఒక వ్యక్తి కారులో నుంచి మహిళను కిందకి తోసివేసినట్లు గుర్తించారు.


అప్పటికే బాధితురాలి నోటి వెంట నురగలు వస్తుండటంతో ఆమె పరిస్థితి విషమంగా ఉందని గ్రహించిన పోలీసులు తమ వాహనంలోనే దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించిన పోలీసులు ఆర్ఎంపీ మహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. తానే గడ్డిమందు ఇచ్చి ఆమెను చంపేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించగా.. నిందితుడికి కఠినంగా శిక్షించాలని వివాహిత బంధవులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa