వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగుదేశం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఇవాళ(బుధవారం) నందికొట్కూరు మండలం దామగట్ల గ్రామంలో ఎంపీ బైరెడ్డి శబరి పర్యటించారు. దామగట్ల గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి, తెలుగుదేశం నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లలో ఏమి చేశారో జగన్ ప్రజలకు చెబితే బాగుంటుందని పేర్కొన్నారు ఎంపీ బైరెడ్డి శబరి.అలా కాకుండా చిల్లర రాజకీయాలతో పాదయాత్ర చేస్తే జనం చెప్పులతో కొడతారని ఎంపీ బైరెడ్డి శబరి హెచ్చరించారు. జగన్ ఐదేళ్లలో చేయని అభివృద్ధి.. కూటమి ప్రభుత్వంలో ఏడాదిలోనే చేసి చూపించామని ఉద్ఘాటించారు. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలను ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు వివరించామని వెల్లడించారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని ఎంపీ బైరెడ్డి శబరి పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa