ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 02:36 PM

ఫారెన్ మెడిక‌ల్ గ్రాడ్యుయేష‌న్‌ ప‌రీక్ష పాసై, ఇంట‌ర్న్‌షిప్ కూడా పూర్తి చేసుకున్న యువ వైద్యులకు ప‌ర్మినెంట్ రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండా చంద్రబాబు ప్రభుత్వం వారిని వేధింపులకుగురిచేస్తోందని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.పలాసలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైద్య విద్యను పూర్తి చేసి... నిబంధనలు ప్రకారం ఇంటర్నషిప్ కూడా కంప్లీట్ చేసి.. దాదాపు ఏడాది కావస్తున్నా   వైద్యులుగా సేవలందించేందుకు సిద్దంగా ఉన్న వారికి  పీఆర్ చేయకపోవడాన్ని తప్పు పట్టారు. రాష్ట్రంలో తగినన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు లేకపోవడం.. ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య ఖరీదు కావడం వల్లే చాలామంది విదేశాల్లో మెడిసిన్ విద్య అభ్యసిస్తున్నారని తెలిపారు. అనంతరం  ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ పరీక్ష కూడా క్లియర్ చేసి... ఆ తర్వాత ఏడాది ఇంటర్నెషిప్ పూర్తి చేసుకున్నా వారికి పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకపోవడం అత్యంత దుర్మార్గమన్నారు.కోవిడ్ టైంలో ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యారన్న సాకుతో రిజిష్ట్రేషన్ నిరాకరస్తున్నారని... మన దేశంతో పాటు ప్రపంచమంతా కోవిడ్ టైంలో ఆన్ లైన్ క్లాసులకే హాజరయ్యారన్న విషయాన్ని గుర్తు చేశారు.తమకు న్యాయం చేయాలని వారు ధర్నాకు దిగితే... వారి సమస్యను  సామరస్యపూర్వకంగా పరిష్కారించాల్సిన ప్రభుత్వం...  నేరస్ధులు తరహాలో వారిని  అత్యంత దుర్మార్గంగా కొట్టి పోలీసు స్టేషన్ కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని.. హక్కులు కోసం ఎవరూ గొంతెత్తి మాట్లేడే వీలు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. డాక్టర్స్ డే రోజునే తమ న్యాయపరమైన డిమాండ్ కోసం ఆందోళన చేస్తుంటే  వైద్య విద్యార్దులను కూడా జైల్లో పెట్టడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మండిపడ్డారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa