ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సింగయ్య ప్రాణాలు కోల్పోవడానికి కారకుడు జగనే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 02:58 PM

‘సింగయ్య మృతిలో కుట్ర ఉంది, సమగ్ర దర్యాప్తు జరిగితే కుట్ర బయటపడుతుందని జగన్‌ భయపడుతున్నారు. అందుకే కోర్టులను ఆశ్రయిస్తున్నారు’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఐదేళ్లు సీఎంగా పనిచేసిన జగన్‌ పల్నాడు పర్యటనలో మానవత్వాన్ని కోల్పోయారు. ఆయన నిర్లక్ష్యానికి దళిత వృద్ధుడు బలయ్యాడు. జరిగిన నేరమంతా డ్రైవర్‌ మీద తోసేయాలని చూస్తున్నారు. అతను ప్రాణాలు కోల్పోవడానికి కారకుడు జగన్‌ రెడ్డే’ అని వర్ల అన్నారు. కాగా, తన కారు కిందపడి చనిపోయిన సొంత పార్టీ కార్యకర్త సింగయ్య కుటుంబంతో జగన్‌ నీచ రాజకీయాలు చేస్తున్నారని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ విమర్శించారు. సింగయ్య భార్యను అడ్డంపెట్టుకుని తాడేపల్లి పెద్దలు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. ఆమెను వైసీపీ వారు బెదిరించి అబద్ధాలు చెప్పిస్తున్నారని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa