ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కరేడు రైతులకి కాంగ్రెస్ అండగా ఉంటుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 03, 2025, 04:03 PM

నెల్లూరు జిల్లా కరేడులో ఇండోసోల్ కంపెనీ సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పచ్చని పొలాలను నాశనం చేసి పరిశ్రమలు పెట్టాలనుకోవడం దారుణమని, కరేడు రైతుల భూముల జోలికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ కంపెనీకి అనుమతులు ఇస్తే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏకంగా ఊరినే ఖాళీ చేయించేలా భూములు కేటాయించాలని చూడటం అన్యాయమని పేర్కొన్నారు. ఈ మేరకు కరేడు రైతులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. "కరేడు రైతులది బతుకు పోరాటం. ఊరిని చంపి పరిశ్రమ పెడతాం అంటే చూస్తూ ఊరుకునేది లేదు. కరేడు భూములు జోలికొస్తే రైతుల పక్షాన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. పచ్చటి పొలాల్లో ప్రజా అభిప్రాయం సేకరించకుండా భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం దుర్మార్గం. ఇది కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం. ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండోసోల్ సోలార్ కంపెనీకి 8,458 ఎకరాలు దారాదత్తం చేస్తామనడం ద్రోహం అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa