ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలను పూర్తిగా అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, వాగ్దానాలను అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, తమను బెదిరింపులతో, కేసులతో భయపెట్టాలని చూసినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ మోసపూరిత విధానాలను ప్రజల ముందుకు బలంగా తీసుకెళతామని ఆయన అన్నారు. ఎన్నికల ముందు గొప్పగా చెప్పిన సూపర్ సిక్స్ హామీలను ఇప్పుడు అమలు చేయకపోవడం ప్రజలను వంచించడమేనని ఆరోపించారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు చేయించడం సరైన పద్ధతి కాదని బొత్స హితవు పలికారు. ఇటువంటి వైఖరిని ప్రభుత్వం మార్చుకోవాలని ఆయన సున్నితంగా హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం గొంతును నొక్కాలని చూడటం సరికాదని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa