ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క్రెడిట్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు ఎస్‌బీఐ యూజర్లపై ప్రభావం

national |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 05:49 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. ఎంపిక చేసిన కార్డులకు సంబంధించి కొన్ని నిబంధనలను సవరించింది. ఈ కొత్త మార్పులు జులై 15 నుంచి అమల్లోకి రానుండగా, వినియోగదారులపై ఆర్థిక భారం పెరిగే అవకాశం ఉంది.ప్రస్తుతం వినియోగదారులు ఆలస్య రుసుమును తప్పించుకోవడానికి చెల్లించే 'కనీస చెల్లింపు మొత్తం' మినిమమ్ అమౌంట్‌ డ్యూ లెక్కించే పద్ధతిలో బ్యాంకు మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, బకాయిపడిన మొత్తంలో కొంత శాతంతో పాటు జీఎస్‌టీ, ఈఎంఐ, ఇతర ఛార్జీలను కలిపి కనీస చెల్లింపు మొత్తాన్ని లెక్కిస్తారు. దీనివల్ల వినియోగదారులు గతంలో కంటే ఎక్కువ మొత్తాన్ని కనీస చెల్లింపుగా చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే వడ్డీ భారం గణనీయంగా పెరుగుతుంది.అదేవిధంగా, కస్టమర్లు చెల్లించే మొత్తాన్ని సర్దుబాటు చేసే విధానంలోనూ మార్పు రానుంది. జులై 15 నుంచి, మీరు చేసే చెల్లింపును ముందుగా జీఎస్‌టీ, ఈఎంఐ, ఇతర ఛార్జీల కింద జమ చేసుకుంటారు. ఆ తర్వాతే కొనుగోళ్లకు లేదా నగదు విత్‌డ్రాలకు సంబంధించిన బకాయిల కింద సర్దుబాటు చేస్తారు. దీనివల్ల బకాయిలపై వడ్డీ భారం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.మరో కీలక మార్పుగా, ఆగస్టు 11 నుంచి కొన్ని ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై అందిస్తున్న కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ను ఎస్‌బీఐ నిలిపివేయనుంది. యూకో బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పీఎస్‌బీ, కేవీబీ, సౌత్ ఇండియన్ బ్యాంక్ వంటి పలు బ్యాంకులతో కో-బ్రాండెడ్ ఎలైట్, ప్రైమ్ కార్డులపై ఈ సౌకర్యం రద్దు కానుంది. ప్రస్తుతం ఈ కార్డులపై రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు బీమా కవరేజీ అందుబాటులో ఉంది. ఈ మార్పుల నేపథ్యంలో, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వినియోగదారులు కొత్త నిబంధనలను పూర్తిగా తెలుసుకుని, అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa