ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేషన్‌ బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 05, 2025, 12:16 PM

వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్‌ బియ్యం పథకాన్ని తొలగించి, కూటమి ప్రభుత్వం తెచ్చిన పాత రేషన్‌ డీలర్ల వ్యవస్థలో తూకాల్లో మోసాలు చేసి పేదలను దోపిడీ చేస్తున్న వైనాన్ని వైయ‌స్ఆర్‌సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి బృందం బట్టబయలు చేసింది. అభినయ్‌రెడ్డి నేతృత్వంలోని బృందం శుక్రవారం తిరుపతి నగరంలో పలు రేషన్‌ దుకాణాల్లో పేదలకు ఇచ్చిన బియ్యాన్ని తన బృందంతో కలిసి తనిఖీ చేసింది. ఒకే సమయంలో 12 రేషన్‌ దుకాణాల్లో పేదలు తీసుకున్న రేషన్‌ బియ్యాన్ని ఆ షాపుల వద్దే ఎలక్ట్రానిక్‌ కాటాపై తూకం వేయగా, 10 కిలోలకు 2 కిలోలు తగ్గినట్లు వెల్లడైంది. 25 కిలోలకు 22.85 కిలోలే వచ్చింది. అంటే ఇక్కడా 2 కిలోలకు పైగా కోత పడింది. 50 కిలోలు తీసుకున్న వారికి 46 కిలోలే వచ్చినట్లు తేలింది. అంటే 4 కిలోలు తగ్గిపోయింది. దాదాపు అందరి బ్యాగుల్లో తక్కువ బియ్యం తూగింది. ఇలా కిలోలకు కిలోలు రేషన్‌ బియ్యం పక్కదారిపడుతున్న భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రేషన్‌ కార్డుదారుల ఎదుటే బియ్యం తూకం వేసి తక్కువగా ఉన్నట్లు చూపించడంతో అనేక మంది లబ్ధిదారులు కూటమి ప్రభుత్వం, డీలర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa