AP: తోటపల్లి ప్రాజెక్టు నుంచి శివారు భూములకు సాగునీరు అందిస్తామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. తోటపల్లి ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువకు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరితో కలిసి ఆదివారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తోటపల్లి, జంఝావతి, పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం పనులను పూర్తిచేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఐటీడీఏ పీవో, వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa