ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ తొలి ఏడాది సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తున్న మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 06, 2025, 09:54 PM

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తోందని, త్వరలోనే అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డ నిధి వంటి కీలక హామీలను కూడా నెరవేరుస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే తన ఏకైక లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమంలో భాగంగా మంత్రి ఆనం తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆదివారం సంగం మండలం కోలగట్ల గ్రామంలో ఆయన పర్యటించి, ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో నేరుగా మాట్లాడారు. తమ ప్రభుత్వ తొలి ఏడాది పాలనలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను, ఆయా కుటుంబాలు పొందిన లబ్ధిని వారికి వివరించారు. సుపరిపాలన అంటే ఏమిటో తమ ప్రభుత్వం చేతల్లో చూపిస్తోందని అన్నారు.మంత్రి నిన్న కుప్పూరుపాడు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనంకు పార్టీ శ్రేణులు, నాయకులు ఘన స్వాగతం పలికారు. జాతీయ రహదారి నుంచి గ్రామం వరకు భారీ ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ పర్యటన ద్వారా ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు మంత్రి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa