తిరుపతి నగరంలోని కపిలతీర్థం కూడలి వద్ద ఆదివారం ఉదయం దారుణ ఘటన చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని వ్యక్తి ఫుట్పాత్పై ఆశ్రయించిన యాచకులపై అకస్మాత్తుగా రాళ్లతో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
దాడిలో ముగ్గురు యాచకులు గాయపడ్డారు. స్థానికులు స్పందించి వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శేఖర్ (55) అనే వ్యక్తి మృతిచెందాడు. మిగిలిన ఇద్దరి పరిస్థితి కూడా నిలకడగా లేదని వైద్యులు తెలిపారు.
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి పాల్పడ్డ వ్యక్తి మానసిక స్థితిని పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa