ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేనలోకి చేరిన నలుగురు జెడ్పీటీసీ సభ్యులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jul 10, 2025, 10:20 AM

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వైసీపీకి చెందిన నలుగురు జెడ్పీటీసీ సభ్యులు జనసేన పార్టీలో చేరారు. చింతలపూడి జెడ్పీటీసీ పొల్నాటి శ్రీనివాసరావు, తాడేపల్లిగూడెం జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, అత్తిలి జెడ్పీటీసీ అడ్డాల జానకి, పెరవలి జెడ్పీటీసీ కొమ్మిశెట్టి రజనీ.. పవన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షుడు పెనుగొండ సబ్బారాయుడు, వైశ్యసత్ర సముదాయాల అధ్యక్షుడు దేవకీ వెంకటేశ్వర్లుతో పాటు మరికొంత మంది జనసేన కండువా కప్పుకొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa