ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమస్యలు పరిష్కారించండి అంటూ రోడెక్కిన రైతులు మీకు దొంగలా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 11, 2025, 12:56 PM

మద్దతు ధర కల్పించలేని ప్రభుత్వ అసమర్థతపై ఆగ్రహంతో రోడెక్కిన రైతులను దండుపాళ్యం బ్యాచ్ అంటూ అసాంఘీక శక్తులు, దొంగలతో పోలుస్తూ కూటమి నేతలు వ్యాఖ్యలు చేయడం, ఎల్లో మీడియా ప్రముఖంగా దానిని ప్రచారం చేయడం పట్ల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేట క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇకపై తమకు అన్యాయం జరగిందంటూ ఎవరు రోడ్డెక్కినా వారిని ఇలాగే చూస్తామని సీఎం చంద్రబాబు చెబుతున్నారా అని ప్రశ్నించారు. రైతుల పట్ల చంద్రబాబు రాక్షసంగా వ్యవహరిస్తే, వారి కన్నీళ్ళను తుడిచేందుకు వైయస్ జగన్ మానవత్వంతో వారి వద్దకు వెళ్ళారని అన్నారు. అన్నం పెట్టే రైతును దుర్మార్గమైన దొంగలతో పోల్చిన నీచమైన రాజకీయానికి చంద్రబాబు తెగబడ్డాడని ధ్వజమెత్తారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa