ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిద్ధరామయ్యకు ఉరటనిచ్చిన హైకోర్టు

national |  Suryaa Desk  | Published : Fri, Jul 11, 2025, 02:17 PM

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో భారీ ఉరట లభించింది. ఆయనపై బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం కేసును హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 2023 ఎన్నికల సమయంలో... 'అవినీతి రేటు కార్డు' ప్రకటనపై బీజేపీ పరువునష్టం కేసు దాఖలు చేసింది. ఇందులో సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ పేర్లను చేర్చింది.బీజేపీ లంచం తీసుకున్నట్టు 2023 ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంలో పదవులు, కాంట్రాక్టులకు లంచాల రేట్లను నిర్ణయించిందని ఆరోపించింది. ఈ ప్రకటన ద్వారా తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ బీజేపీ పరువునష్టం దావా వేసింది. ఈ కేసును ధర్మాసనం తాత్కాలికంగా నిలిపివేయడంతో కాంగ్రెస్ నేతలకు భారీ ఊరట లభించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa