ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకాకుళం జిల్లాలో దారుణం, హత్యకి గురైన వైసీపీ కార్యకర్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 12, 2025, 02:26 PM

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేట గ్రామ సమీపంలో ప‌ట్ట‌ప‌గ‌లే దారుణ హ‌త్య జ‌రిగింది. గ్రామంలోని నేషనల్ హైవే సర్వీస్ రోడ్డుపై వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త, ఉప సర్పంచ్ సత్తారు గోపి (35) దారుణ హత్యకు గురయ్యాడు. రాళ్లు, కర్రలతో దుండగులు తల, శరీర భాగాలపై కొట్టి అతన్ని హతమార్చిన ఘటన పట్టపగలు న‌డిరోడ్డుపై జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ హత్య వెనుక టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఉన్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa