అత్యంత వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాను టీడీపీ ఎప్పటికప్పుడు మోసం చేస్తూనే ఉందని, ఈ ప్రాంత అభివృద్ధిపై అస్సలు దృష్టి సారించిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదని మాజీ రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు ఆవేదన చెందారు. స్థానిక వైఎస్సార్ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడాది కాలం పాలనలో కనీసం వెయ్యి కోట్లు కూడా ఈ ప్రాంతం అభివృద్ధికి కేటాయించలేకపోయారు. ఆయనకు ఈ జిల్లా అభివృద్ధి పట్టడం లేదు. మీరంతా కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అంటున్నారు. కానీ ఇది కూటమి ప్రభుత్వం కాదు టీడీపీ ప్రభుత్వం అని మాత్రమే వ్యవహరించాలి. పవన్ కల్యాణ్ గారు గొంతు విప్పి మాట్లాడలేకపోతున్నారు. బీజేపీ అయితే ఎన్నికలకు ముందే చంద్రబాబు ప్రకటించిన మ్యానిఫెస్టోతో మాకేంటి సంబంధం అని సభాముఖంగానే వాళ్ల నాయకులు సైడ్ అయిపోయారు. అంటే ఇది టీడీపీ ప్రభుత్వం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాల్సింది ఎవరు ? అసలు మాట్లాడాల్సింది ఎవరు ? మీరు.. మీరు అంటే కార్యకర్తలు. సోషల్ మీడియాను కేంద్రంగా చేసుకుని దాన్నొక ఆయుధంగా చేసుకుని మీరంతా పనిచేయాలి. ముఖ్యంగా గుడ్ మార్నింగులు, గుడ్నైట్ లు చెప్పడం కాదు పార్టీ విధివిధానాలు, అలానే టీడీపీ పాలన సంబంధ వైఫ్యలాలు వీటి గురించి ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలి అని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa