గోదావరి ఎగువన పెరుగుతున్న వరద ఉధృతికి దిగువున నదీపాయలు నిండుగా ప్రవహిస్తున్నాయి. దీంతో కోనసీమలోని గోదావరి లంక గ్రామాల్లో వణుకు మొదలైంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి దిగువకు 5,29,209 లక్షల క్యూసెక్కుల వరదనీరు సముద్రంలోకి వదు లుతున్నారు. దీంతో కోనసీమ పరిధిలోని దిగువన ఉన్న గౌతమి, వృద్ధగౌతమి, వశిష్ఠ వైనతేయ గోదావరి నదీపాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పి.గన్నవరం మండల పరి ధిలోని గంటిపెదపూడి, ఉడిమూడి శివారు బూరుగులంక, పెదపూడిలంక, అరిగెలవారి పేట, ఉడిమూడిలంక గ్రామస్తులు బూరుగు లంక నదీపాయ నుంచి ఇంజన్ పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రామాలైన పెదమ ల్లంక, అనగార్లంక, అయోధ్యలంక తదితర లంకగ్రామాల ప్రజానీకం పడవలపై రాకపో కలు సాగిస్తున్నారు. నదీపరీవాహక ప్రాంతా ల్లోకి వరదనీరు చేరడంతో స్థానిక కూరగా యల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం బూరుగులంక రేవు వద్ద అధికారులు రెండు ఇంజన్ పడవలు ఏర్పా టుచేసి పర్యవేక్షణ చేస్తున్నారు. ఆదివారం కాజ్వేపై నుంచి నీరు ప్రవహించే అవకాశం ఉంది. వరద ఉధృతి నేపథ్యంలో పి.గన్న వరం హెడ్వర్క్స్ కార్యాలయం వద్ద ఇసుక బస్తాలు, సంచులు, కర్రలను అధికారులు సిద్ధంచేశారు. అయితే భద్రాచలం వద్ద శని వారం మధ్యాహ్నం నుంచి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో స్థానిక ప్రజానీకం, అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa