ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దళిత, గిరిజన సముదాయాలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలను అరికట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకుడు చెలమప్ప ఆదివారం విలేకరులతో అన్నారు. శెట్టూరు మండలం మాకోడికి గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా దళితులు మొక్కులు సమర్పించడానికి వచ్చినప్పుడు వారిని అవమానించడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలు సమాజంలో ఇంకా సామాజిక వివక్ష కొనసాగుతున్నదనడానికి నిదర్శనమని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితులపై జరిగిన అవమానకరమైన చర్యలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని, దీనివల్ల బాధితులకు న్యాయం జరగడం లేదని ఆయన ఆరోపించారు. ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో పదేపదే జరుగుతున్నప్పటికీ, వాటిని నివారించేందుకు గట్టి చర్యలు లేకపోవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
దళిత, గిరిజన సముదాయాలపై జరుగుతున్న దాడులు, అవమానాలు సమాజంలో లోతుగా ఉన్న అసమానతలను బహిర్గతం చేస్తున్నాయని చెలమప్ప తెలిపారు. ఈ ఘటనలను నివారించడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, సమాజంలో సామాజిక న్యాయం, సమానత్వం స్థాపించడానికి అధికార యంత్రాంగం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఇటువంటి సంఘటనలు మరలా జరగకుండా చూడడానికి, సమాజంలో అవగాహన కల్పించడంతో పాటు, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa