ఇంగ్లాండ్తో లార్డ్స్లో జరుగుతున్న మూడో టెస్టులో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ అదరగొడుతున్నాడు. ఓవర్నైట్ స్కోరు 2/0తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్కు ఆదిలోనే షాక్ ఇచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా వికెట్లు తీయలేకపోయినా.. సిరాజ్ మాత్రం వదల్లేదు. అద్భుత బౌలింగ్లో ఇంగ్లీష్ బ్యాటర్లను పదే పదే ఇబ్బంది పెట్టిన ఈ హైదరాబాదీ పేసర్.. రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో భారత్కు శుభారంభం అందించాడు. రెండు జట్లు మొదటి ఇన్సింగులో 387 పరుగులకే అలౌట్ కావడంతో లార్డ్స్ టెస్ట్ రసవత్తరంగా మారింది.
తొలి వికెట్ బెన్ డకెట్..
ఐదు ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్.. 18/0తో నిలిచింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు వికెట్ ఇవ్వకూడదని పట్టుదలతో బ్యాటింగ్ చేశారు. కానీ ఆరో ఓవర్ వేసేందుకు వచ్చిన సిరాజ్.. మంచి ఊపులో కనిపించిన బెన్ డకెట్ (12)ను ఔట్ చేశాడు. భారీ షాట్ ఆడేందుకు అతడు ప్రయత్నించగా.. కానీ సరిగ్గా బ్యాట్కు కనెక్ట్ కాలేదు. దీంతో బంతి వెళ్లి జస్ప్రీత్ బుమ్రా చేతిలో పడింది. ఈ సమయంలో సిరాజ్.. భావోద్వేగాన్ని అదుపులోకి చేసుకోలేకపోయాడు. డకెట్ వద్దకు వెళ్లి గట్టిగా అరిచాడు.
రీవేంజ్ అదుర్స్
100% వికెట్.. ఓలీ పోప్ ఔట్..
ఆ తర్వాత వరుస ఓవర్లు బౌలింగ్ చేసిన మహమ్మద్ సిరాజ్.. 12వ ఓవర్లో మరో వికెట్ అందించాడు. ఓలీ పోప్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. సిరాజ్ వేసిన బంతిని ఓలీ పోప్ మిస్ అయ్యాడు. బంతి వెళ్లి నేరుగా ప్యాడ్కు తగిలింది. కానీ సిరాజ్ ఎంత అప్పీల్ చేసి అంపైర్ మాత్రం ఔట్ ఇవ్వలేదు. కానీ సిరాజ్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. డౌట్లో ఉన్న గిల్కు ఇది 100% వికెట్ అన్నట్లు చెప్పాడు. దీంతో గిల్ రివ్యూ తీసుకోవాల్సి వచ్చింది. సిరాజ్ ఊహించినట్లుగానే.. రివ్యూలో ఔట్ అని తేలింది. దీంతో భారత్కు రెండో వికెట్ దక్కింది. ఆ తర్వాత బౌలింగ్లోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి.. జాక్ క్రాలీని ఔట్ చేశాడు. తొలి ఇన్నింగ్స్లోనూ క్రాలీ.. నితీశ్ రెడ్డి బౌలింగ్లోనే ఔట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లోనూ అతడికి వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో 50 పరుగులకే ఇంగ్లాండ్ 3 వికెట్లు కోల్పోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa