వర్షాకాలంలో చాలా మంది వేడివేడిగా టీ, కాఫీలను తాగుతారు. కాఫీని ఎక్కువగా కాఫీ పౌడర్ కలిపి తయారు చేస్తారు. కానీ, టీని టీ పౌడర్, పంచదారతో పాటు అల్లం, యాలకులు వంటివి వేస్తాం. అయితే, వర్షాకాలంలో మరికొన్ని పదార్థాలను వేసి టీ తయారు చేస్తే మరిన్ని లాభాలున్నాయని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. ఎప్పుడూ టీలో అల్లం మాత్రమే వేస్తున్నారా, ఓ సారి కొన్ని పదార్థాలు కూడా కలిపి చూడండి వర్షాకాలంలో ఎలాంటి సమస్యలు మీ దరికి రావు
నార్మల్గానే టీ, కాఫీలను ఎక్కువగా ఇష్టపడతారు. ఇక చల్లగా ఉన్న టైమ్లో అయితే మరీనూ ఎక్కువగా సిప్ చేస్తుంటారు. ఇందుకోసమే వర్షాకాలం, చలికాలంలో ఎక్కువగా టీలు తాగుతుంటారు. దీంతో చల్లని వాతావరణంలో టీ బాడీని వెచ్చగా చేస్తుంది. అందుకే, దీనిని తాగుతుంటారు. దీనిని తాగడం వల్ల కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయంటే ఒకే దెబ్బకి రెండు పిట్టల్లా ఉంటుంది కదా. అవును వర్షాకాలంలో ఇమ్యూనిటీ బలహీనమై చాలా జలుబు, దగ్గు, తుమ్ములు, జ్వరం వంటి సమస్యలతో బాధపడతారు. అలాంటి వాటి నుంచి బయట పడాలంటే మీరు టీలో కొన్ని పదార్థాలు కలిపి తీసుకోవడం మంచిది. ఓ రకంగా చెప్పాలంటే వీటిని మూలికలనే చెప్పొచ్చు. ఎక్కువగా ఇంట్లోనే లభించే ఈ మూలికలు మీ టీ రుచిని అమాంతంగా పెంచడమే కాదు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని కూడా అందిస్తాయి. మరి ఆ మూలికలు ఏంటో తెలుసుకోండి.
పసుపు
పసుపు.. వంటల్లో వాడే పసుపులోని కర్కుమిన్, డెస్మెథాక్సికర్కుమిన్, డిస్ డెస్మెథాక్సికర్కుమిన్ వంటివన్నీ కూడా మన బాడీలోకి చేరి శరీరాన్ని బలంగా చేస్తాయి. అంతేకాదు, ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల వర్షాకాలంలో వచ్చే ఎన్నో ఇన్ఫెక్షన్లని తగ్గిస్తుంది. పసుపు కొద్దిగా కలిపిన టీ తీసుకోవడం వల్ల బరువు కూడా ఈజీగా తగ్గుతారు. అయితే ఎక్కువగా కలపొద్దు. దీని వల్ల రుచి మారుతుంది. చేదుగా ఉంటుంది.
అల్లం
సాధారణంగా అల్లం టీని చాలా మంది ఇష్టంగా తాగుతారు. దీని వల్ల టీకి రుచి మాత్రమే కాదు. చాలా సమస్యలు తగ్గుతాయి. అల్లాన్ని టీలో కలిపి తాగడం వల్ల వర్షాకాలంలో వచ్చే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. దీనిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ, జీవక్రియ రెండూ కూడా పెరుగుతాయి. అల్లంని టీలో వేసుకుని తాగడం వల్ల ప్రేగు పనితీరు మెరుగ్గా మారుతుంది. మార్నింగ్ సిక్నెస్, వికారం కూడా కంట్రోల్ అవుతుంది.
తులసి
తులసిని మన ఇళ్ళల్లో సాంప్రదాయకంగాను, ఆరోగ్య పరంగాను ఎన్నో విధాలుగా వాడతారు. దీంతో టీ చేసుకుని తాగితే ఛాతీలోని కఫం తగ్గుతుంది. మూసుకుపోయిన ముక్కుని క్లియర్ చేస్తుంది. తులసిలో విటమిన్ ఎ, డి, ఐరన్, ఫైబర్లతో పాటు ఇతర భాగాలు బ్యాక్టీరియాని నాశనం చేస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి. దీంతోపాటు తులసిని తీసుకోవడం వల్ల దంత ఆరోగ్యం మెరుగవుతుంది. దీనికోసం మనం టీ చేుసేటప్పుడు ఒకట్రెండు ఆకులు టీలో వేసి మరిగించండి. తర్వాత వడకట్టి తాగండి.
మందార టీ
వర్షం పడుతుండగా మందారం కలిపిన టీ తాగండి. దీని వల్ల ఇందులోని బీటా కెరోటిన్, విటమిన్ సి, ఆంథోసైనిన్స్ మన ఇమ్యూనిటినీ బ్యాలెన్స్ చేస్తాయి. ఈ కారణంగా అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అంతేకాకుండా, ఇందులోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా శరీరానికి చాలా మంచివి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa